In an audio tape from one organisation could be heard asking its followers to launch harm on Kumbh Mela and Thrisoor Puram <br /> <br />ఐఎస్ ఉగ్రవాదులు భారత్లో మారణహోమం సృష్టించబోతున్నారా? యూరప్ తదితర దేశాల్లో భారీ వాహనాలను జనాలమీదకు పోనిచ్చినట్లుగా నరమేధానికి ప్లాన్ వేసుకున్నారా? ముఖ్యంగా హిందూ పండగలే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చేలా ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ విడుదల చేసిన ఆడియో టేప్ ఒకటి కలకలం రేపుతోంది. ఆఫ్ఘన్లోని టెలిమెసెంజర్ అలాగే ఇన్స్టాంట్ చాట్ అప్లికేషన్స్ ద్వారా ఈ ఆడియో క్లిప్ ప్రచారం అవుతున్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. రషీద్పై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కేరళ పోలీసులు కూడా రషీద్ నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.
